భారతదేశం, మార్చి 10 -- Mlc Somu Veerruaju: ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోము వీర్రాజు పేరును బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది. సోము వీర్రాజు, మాధవ్‌ల మధ్య చివరి వరకు పోటీ కొనసాగినా సోము వీర్రాజు వైపు బీజేపీ అధిష్టానం మొగ్గు చూపించింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలపై ఏపీ అసెంబ్లీ లాబీలో బీజేపీ నాయకుడు విష్ణుకుమార్ రాజు క్లారిటీ ఇచ్చారు. ఆ వెంటనే బీజేపీ సోము వీర్రాజు పేరును ఖరారు చేసినట్టు అధికారికంగా ప్రకటించింది.

బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోము వీర్రాజు ను ఖరారు చేశామని, సోమవారం సోము వీర్రాజు నామినేషన్ దాఖలు చేస్తారని విష్ణుకుమార్ రాజు చెప్పారు. మరోవైపు జనసేన తరపున ఇప్పటికే నాగబాబు నామినేషన్‌ దాఖలు చేయగా టీడీపీ తరపున బీటీ నాయుడు, కావలి గ్రీష్మ, బీద రవిచంద్ర నామినేషన్‌ వేయనున్నారు. ఎన్నికలు లేకపోతే వీరందరిని ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ...