భారతదేశం, ఏప్రిల్ 17 -- MLAs Babli Case: బాబ్లీ కేసు Babli Case విచారణలో భాగంగా మహారాష్ట్ర లోని బిలోలి సెషన్ కోర్టు Biloli Sessions Court కు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్ Gangula Kamlakar, విజయ రామారావు Vijaya Rama Rao, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ Praksh Goud మాజీ ఎమ్మెల్యేలు హనుమంతు షిండే, కె.ఎస్.రత్నం హాజరయ్యారు.

మహారాష్ట్ర ప్రభుత్వం గోదావరి నదిపై బాబ్లీ ప్రాజెక్టు నిర్మించి నీళ్ళు రాకుండా అడ్డుకోవడంతో 2010లో అప్పట్లో టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో భారీ ఆందోళనకు దిగారు.

బాబ్లీ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసే వరకు కదలమని భీష్మించడంతో మహారాష్ట్ర పోలీసులకు టిడిపి నాయకులకు మద్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. దీంతో మరాఠి పోలీసులు లాఠీ చార్జి చేయడమే కాకుండా చంద్రబాబు తో సహా Telangana TDP తెలంగాణ టీడ...