భారతదేశం, ఏప్రిల్ 8 -- Miss World 2025 Showcase : తెలంగాణ టూరిజం బ్రాండ్ పెరిగేలా, తెలంగాణ అతిథ్యానికి వన్నె తెచ్చేలా మిస్​వరల్డ్​ పోటీలు ఉండాలని టూరిజం సెక్రటరీ స్మితా సభర్వాల్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. స్వాగత ఏర్పాట్లపై మంగళవారం ఆమె సమీక్ష నిర్వహించారు. మే 7 నుంచి 31 వరకు 72వ మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఈ పోటీలలో 120 దేశాలకు చెందిన మోడల్స్​పాల్గొంటారు. వారు మే 6, 7 న హైదరాబాద్​ చేరుకుంటారు. దీంతో వారి రాక సందర్భంగా చార్మినార్ వద్ద హెరిటేజ్ వాక్, చౌమొహల్లా ప్యాలెస్ లో వెల్కమ్ డిన్నర్ ఉంటుంది. వీటి ఏర్పాట్ల కోసం టూరిజం, జీహెచ్ఎంసీ, హెరిటేజ్, పోలీస్ ఆఫీసర్లతో ప్యాలెస్ లో క్షేత్రస్థాయిలో పర్యటించారు.

వెల్కమ్ డిన్నర్ లో తెలంగాణ టూరిజం బ్రాండ్ ఇమేజ్ అనుగుణంగా ఏర్పాట్లను చేయాలని స్మితా సభర్వాల్ అధికారులకు...