భారతదేశం, ఫిబ్రవరి 25 -- Mirchi Rates : రాష్ట్రంలో పండిన మిర్చి పంట‌లో 25 శాతానికి మార్కెట్ ఇంటర్వెన్షన్ ప్రైస్ వర్తింపు చేస్తామ‌ని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. మిర్చి క్వింటా ధ‌ర రూ.11,781గా నిర్ణయించారు. అయితే అద‌నంగా ఇచ్చిన మొత్తం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50:50 నిష్పత్తి భ‌రించాల‌ని ష‌ర‌తును కేంద్ర ప్రభుత్వం పెట్టింది. అలాగే దీనికి సంబంధించిన‌ వర్కింగ్ క్యాపిటల్‌ను ఏర్పాటు చేయడం బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వానిదేన‌ని స్పష్టం చేసింది. ఈ మేర‌కు రాష్ట్రప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది.

మిర్చి ధ‌ర‌లు ప‌త‌నం అవ్వడంతో రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్నడూ లేనంత‌గా ధ‌ర‌లు ప‌డిపోయాయి. దీంతో రైతులు మిర్చి అమ్మకాలు చేయ‌లేక‌, పండిన పంట ఉంచుకోలేక ఇబ్బందులు ప‌డుతున్నారు. ఈ అంశంలో తీవ్ర చ‌ర్చానీయాంశంగా మారింది. వైసీప...