భారతదేశం, మార్చి 19 -- Minor Gang Rape: కృష్ణా జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. బాలికను బంధించిన యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు నలుగురు రోజుల పాటు వేర్వేరు ప్రాంతాల్లో బంధించి ఆమెపై అత్యాచారం చేశారు. చివరకు విజయవాడలో బాలికను వదిలేయడంతో ఓ ఆటో డ్రైవర్ చొరవతో వెలుగులోకి వచ్చింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.నిందితుల్లో పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థి కూడా ఉన్నట్టు గుర్తించారు.

ఎన్టీఆర్‌ జిల్లా జి.కొండూరుకు చెందిన బాలిక, ఆమె ఇంటి పక్కన ఉండే యువతితో కలిసి మార్చి 9న గన్నవరం మండలం వీరపనేని గూడెం వచ్చింది. ఈ క్రమంలో వీరపనేని గూడెంలోని యువతి ఇంట్లో గొడవలు జరిగాయి. గొడవకు బాధిత బాలిక కారణమంటూ యువతి తల్లి ఆమెను మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన బాలిక మార్చి 13న ఇంటి నుంచి బయటకు వచ్చేసింది.

వీరపనేన...