భారతదేశం, జనవరి 12 -- Minister Ponguleti : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు ఒకేసారి రెండు టైర్లు పేలడంతో కంట్రోల్ తప్పింది. డ్రైవర్ చాకచక్యంతో కారును నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది. వరంగల్ నుంచి ఖమ్మం వస్తుండగా తిరుమలాయపాలెం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. అనంతరం ఎస్కార్ట్ కారులో మంత్రి పొంగులేటి ఖమ్మం చేరుకున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో మంత్రి పొంగులేటితో పాటు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్, డీసీసీబీ డైరెక్టర్లు బొర్రా రాజశేఖర్, తుళ్లూరి బ్రహ్మయ్య ఉన్నారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....