భారతదేశం, డిసెంబర్ 13 -- గోట్ టూర్ లో భాగంగా హైదరాబాద్ లో మెస్సీ ఈవెంట్ కోసం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇక్కడికి చేరుకున్నారు. సీఎం రేవంత్ వెళ్లి ఆహ్వానం పలికారు.

కోల్ కతాలో ఘటన నేపథ్యంలో హైదరాబాద్ లో మెస్సి టూర్ కోసం ఇక్కడి పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. 4 వేల మంది పోలీసులను మోహరించినట్లు రాచకొండ పోలీస్ కమీషనర్ సుధీర్ బాబు తెలిపారు.

ఫుట్ బాల్ స్టార్ లియోనెల్ మెస్సి హైదరాబాద్ చేరుకున్నాడు. ప్రత్యేక విమానంలో అతను శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు వచ్చాడు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....