భారతదేశం, జనవరి 26 -- మారుతి సుజుకి ఇండియా కార్ల ధరలు ఫిబ్రవరిలో పెరగనున్నాయి. జనవరి 31 నాటికి చౌకగా కార్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీకు బడ్జెట్ తక్కువగా ఉంటే లోన్ ఈఎంఐలపై కూడా కొనుగోలు చేయవచ్చు. మీరు కొత్త తరం డిజైర్ కొనుగోలు చేయాలనుకుంటే వివిధ వడ్డీ రేట్లు, కాలపరిమితిపై దాని నెలవారీ ఈఎంఐ ఎంత అనేది తెలుసుకుందాం..

డిజైర్ బేస్ వేరియంట్ ఎల్ఎక్స్ఐ ఎంటి పెట్రోల్ ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ.6.79 లక్షలు. బ్యాంక్ లేదా ఫైనాన్స్ కంపెనీ 80 శాతం లేదా అంతకంటే ఎక్కువ ఆటో లోన్ ఇవ్వవచ్చు. అలాంటప్పుడు రూ.79,000 డౌన్ పేమెంట్ ద్వారా రూ.6 లక్షల రుణం తీసుకుంటే ఎంత ఈఎంఐ కట్టాల్సి వస్తుందో అర్థం చేసుకోవాలి. డౌన్ పేమెంట్, ఇన్సూరెన్స్, ఆర్టీవో వంటి ఇతర ఖర్చులను మీ జేబు నుంచే చెల్లించాల్సి ఉంటుంది.

మారుతి డిజైర్ ఎల్ఎక్స్ఐ ఎంటి పెట్రోల్ బేస్ వేరియంట్ కొనుగోలు ...