Hyderabad, మార్చి 25 -- Manoj Bharathiraja dies: ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు భారతీరాజా తనయుడు అయిన మనోజ్ భారతీరాజా కన్నుమూశాడు. గతేడాది స్నేక్స్ అండ్ ల్యాడర్స్ అనే థ్రిల్లర్ వెబ్ సిరీస్ లో నటించిన అతడు.. గుండెపోటుతో మంగళవారం (మార్చి 25) సాయంత్రం మరణించాడు. ప్రముఖ నటి ఖుష్బూ సుందర్ సోషల్ మీడియాలో ఈ విషయాన్ని వెల్లడిస్తూ తీవ్ర దిగ్బ్రాంతికి లోనైనట్లు తెలిపింది.

తమిళంతోపాటు తెలుగులోనూ అద్భుతమైన సినిమాలు తీసిన దర్శకుడు భారతీరాజా తనయుడే ఈ మనోజ్ భారతీరాజా. 1999లో వచ్చిన తాజ్ మహల్ సినిమాతో నటుడిగా పరిచమయ్యాడు. ఆ తర్వాత సముదిరమ్, అల్లి అర్జున లాంటి సినిమాల్లో నటించాడు. ఈ మధ్యే అతనికి బైపాస్ సర్జరీ జరిగింది. మంగళవారం సాయంత్రం మరోసారి గుండెపోటు రావడంతో మనోజ్ తుదిశ్వాస విడిచాడు. అతనికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

చెన్నైలోని చేట్‌పేట్ లో మనోజ్ ...