భారతదేశం, మార్చి 15 -- Malayalam OTT: మ‌ల‌యాళం మూవీ ఇథువ‌రే థియేట‌ర్ల‌లో రిలీజైన ఏడాది త‌ర్వాత ఓటీటీలోకి వ‌చ్చింది. శ‌నివారం అమెజాన్ ప్రైమ్‌లో ఈ డ్రామా థ్రిల్ల‌ర్ మూవీ విడుద‌లైంది. ఇథువ‌రే మూవీలో క‌ళాభ‌వ‌న్ షాజోన్‌, లీతా సునీల్ కీల‌క పాత్ర‌లు పోషించారు. అనిల్ థామ‌స్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

గ‌త ఏడాది మార్చిలో ఇథువ‌రే మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైంది. మంచి మెసేజ్ ఓరియెంటెడ్ మూవీగా ప్రేక్ష‌కుల మెప్పిను పొందింది. అక్ర‌మంగా ఏర్పాటుచేసే డంపింగ్ యార్డ్‌ల వ‌ల్ల ప‌ర్యావ‌ర‌ణం ఎలా క‌లుషిత‌మ‌వుతుంది? ప్ర‌జ‌ల ప్రాణాల‌కు ఎలాంటి ముప్పు వాటిల్లుతుంద‌నే కాన్సెప్ట్‌తో ఈ మూవీ తెర‌కెక్కింది.

విక్ర‌మ‌న్ నాయ‌ర్ సిటీకి దూరంగా భార్య‌, కొడుకుతో క‌లిసి సంతోషంగా జీవితాన్ని సాగిస్తుంటాడు. అత‌డు ఉండే ఏరియాకు ద‌గ్గ‌ర‌లోనే అక్ర‌మంగా ఓ డంపింగ్ యార్డ్‌ను ఏర్పాటుచేస్తారు. ఆ ...