భారతదేశం, ఏప్రిల్ 17 -- Mahindra XUV 3XO bookings open మహీంద్రా ఎక్స్ యూ వీ 3ఎక్స్ఓ ను ఏప్రిల్ 29 న లాంచ్ చేయనున్నారు. మహీంద్రా ఎక్స్ యూ వీ 300 ను మరింత అప్ గ్రేడ్ చేసి ఈ మహీంద్రా ఎక్స్ యూ వీ 3ఎక్స్ఓ ను రూపొందించారు. మహీంద్రా ఎక్స్ యూ వీ 3ఎక్స్ఓ ను కొనుగోలు చేయాలని మీరు నిర్ణయించుకుని ఉంటే, ఎంపిక చేసిన మహీంద్రా డీలర్ షిప్ లు అనధికారికంగా ఈ ఎస్ యూ వీ బుకింగ్స్ ను ప్రారంభించాయి. ఆ డీలర్ల వద్ద రూ.21,000 టోకెన్ మొత్తం చెల్లించి, మహీంద్రా ఎక్స్ యూ వీ 3ఎక్స్ఓ ను బుక్ చేసుకోవచ్చు.

మహీంద్ర వాహనాలకు సంబంధించి మరో ఆఫర్ ను కూడా కస్టమర్లకు అందిస్తున్నారు. ఒకవేళ, ముందే వేరే మహీంద్ర వాహనాల కోసం బుక్ చేసుకుని ఉంటే, ఆ బుకింగ్ ను మహీంద్రా ఎక్స్ యూ వీ 3ఎక్స్ఓ (Mahindra XUV 3XO) కు మార్చుకునే సదుపాయాన్ని కల్పిస్తున్నారు. అదే సమయంలో, ఇప్పటికే మార్కెట్లో ఉన్...