Hyderabad, మార్చి 30 -- Director Rajesh Chikile About Madhuram Movie: యంగ్ హీరో ఉదయ్ రాజ్, వైష్ణవి సింగ్ జంటగా నటించిన టీనేజ్ లవ్ స్టోరీ మూవీ మధురం. ఏ మెమొరబుల్ లవ్ అనేది ట్యాగ్‌లైన్. శ్రీ వెంకటేశ్వర ఎంటర్‌టైన్మెంట్ పతాకంపై నిర్మాత యం బంగర్రాజు మధురం సినిమాను నిర్మించారు.

మధురం సినిమాకు రాజేష్ చికిలే దర్శకత్వం వహించారు. టీనేజ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం.. ఇప్పటికే షూటింగ్‌తో సహా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అవుతోంది. ఏప్రిల్ 18న గ్రాండ్‌గా థియేటర్లలో మధురం సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ ఇంట్రెస్టింగ్ విశేషాలు పంచుకుంది.

ఈ సందర్భంగా హీరో ఉదయ్ రాజ్ మాట్లాడుతూ.. "శ్రీ వెంకటేశ్వర ఎంటర్‌టైన్మెంట్స్ అధినేత బంగార్రాజు గారు ఈ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను...