భారతదేశం, ఫిబ్రవరి 21 -- ప్రతి ఏటా సూర్యగ్రహణాలు, చంద్రగ్రహణాలు ఏర్పడుతూనే ఉంటాయి. అయితే మార్చి నెలలో చంద్రగ్రహణం ఏర్పడుతోంది. ఇది భారతదేశంలో కనపడుతుంది కాబట్టి శతకాలాన్ని కూడా పరిగణించాలి. విశ్వావసు నామ సంవత్సరంలో మార్చి 3, మంగళవారం నాడు పాక్షిక కేతుగ్రస్త గ్రస్తోదయ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఫాల్గుణ పౌర్ణమి నాడు, మంగళవారం పూర్వఫాల్గుణి నక్షత్రం, సింహరాశిలో ఈ పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. విశ్వవాసు నామ సంవత్సరంలో ఏర్పడబోతున్న చివరి గ్రహణం ఇది.

ఈ గ్రహణం భారతదేశంలో కనపడుతుంది కాబట్టి గ్రహణ నియమాలను కూడా పాటించాలి. ఈ గ్రహణ సమయంలో ఆలయాలను మూసివేస్తారు. అలాగే గ్రహణ సమయంలో రెండు సార్లు స్నానం చేస్తారు. గ్రహణం ప్రారంభం అయినప్పుడు పట్టు స్నానం, పూర్తయ్యాక విడుపు స్నానం చేస్తారు. మన దేశంలో చూసినట్లయితే, గ్రహణం విడుపు మాత్రమే కనబడుతుంది. కనుక ద...