భారతదేశం, మార్చి 21 -- London Heathrow Airport: లండన్ లోని ప్రతిష్టాత్మక హీత్రూ ఎయిర్ పోర్టు ప్రాంగణంలో ఉన్న విద్యుత్ సబ్ స్టేషన్ లో అగ్నిప్రమాదం జరిగింది. విమానాశ్రయం నుంచి విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. విమానాశ్రయాన్ని ఈ నెల 21వ తేదీ అర్ధరాత్రి వరకు మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. విమానాశ్రయం మూసివేత నేపథ్యంలో ప్రయాణికులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుమారు 10 ఫైరింజన్లు, 70 మంది అగ్నిమాపక సిబ్బందిని రంగంలోకి దింపి 150 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.

విమానాశ్రయానికి సరఫరా చేసే విద్యుత్ సబ్ స్టేషన్ లో అగ్నిప్రమాదం కారణంగా హీత్రూ ఎయిర్ పోర్ట్ లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని విమానాశ్రయ అధికారులు తెలిపారు. ''మా ప్రయాణీకులు మరియు సహోద్యోగుల భద్రత కోసం హీత్రూ ఏర్ పోర్ట్ న...