భారతదేశం, ఏప్రిల్ 24 -- Lok sabha elections 2024: రెండో దశ పోలింగ్ లో 13 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరుగుతున్న రాజస్తాన్ లో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కర్నాటకలో ఇటీవల జరిగిన ఒక ఘటనను ప్రస్తావించారు. హనుమాన్ చాలీసా వింటున్న దుకాణదారుడిపై కొందరు దాడి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో హిందూ దేవుడిని పూజించడం 'నేరం'గా మారిందని ప్రధాని (PM Modi) విమర్శించారు.

బీజేపీ పాలిత రాజస్తాన్ లోని టోంక్-సవాయ్ మాధోపూర్ లోక్ సభ నియోజక వర్గంలో జరిగిన భారీ ర్యాలీలో ప్రసంగించిన ప్రధాని మోదీ హనుమాన్ జయంతి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు. ''రాజస్థాన్ లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా ఈ ఏడాది శ్రీరామనవమి రోజున రాజస్తాన్ లో శోభాయాత్ర నిర్వహించారు. ప...