భారతదేశం, ఏప్రిల్ 27 -- 2024 Lok Sabha elections Bengaluru : 'రండి.. ఓటు వేయండి' అని రాజకీయ నేతలు, సెలబ్రిటీలు, ప్రముఖులు ఎంత మంది ప్రచారాలు చేసినా.. ప్రముఖ నగరాల్లో పెద్దగా స్పందన లభించడం లేదు! శుక్రవారం జరిగిన 2024 లోక్​సభ ఎన్నికల రెండో దశ పోలింగ్​ ఇందుకు మరో ఉదాహరణ. బెంగళూరులో దాదాపు సగం మంది ఓటర్లు.. తమ ఓటు హక్కును ఉపయోగించుకోకపోవడం ఆందోళనకు గురిచేస్తోంది.

కర్ణాటకలోని 14 నియోజకవర్గాల్లో 69.23 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే బెంగళూరులోని మూడు కీలక నియోజకవర్గాలైన బెంగళూరు సెంట్రల్, బెంగళూరు నార్త్, బెంగళూరు సౌత్​లలో ఓటింగ్ శాతం.. మొత్తం రాష్ట్ర సగటు కంటే తక్కువగా నమోదైంది. కర్ణాటకలోని 14 నియోజకవర్గాల్లో 69.23 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించినప్పటికీ, ఈ మూడు పట్టణ ప్రాంతాల్లో తక్కువ శాతం ఓటర్లు తమ ...