భారతదేశం, ఫిబ్రవరి 6 -- Kumbhamela Trains: మహా కుంభమేళాకు వెళ్లే యాత్రీకుల కోసం నాలుగు ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. తిరుప‌తి నుంచి ప్ర‌యాగ్‌రాజ్ మీదుగా బిహార్‌లోని ధ‌న‌పూర్‌కు మ‌ధ్య నాలుగు మహా కుంభ స్పెషల్ రైళ్ల‌ను న‌డ‌ప‌డానికి నిర్ణ‌యించింది.

ఈ రెండు రైళ్లు రాయ‌ల‌సీమ జిల్లాల‌లో పాటు తెలంగాణ‌లోని వివిధ రైల్వే స్టేష‌న్ల మీదుగా వెళ్తాయి. ఈ ప్రాంత ప్రజల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, మహా కుంభమేళాకు ప్రయాణికులు, యాత్రికులు, భక్తుల అదనపు రద్దీని తగ్గించడానికి ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించిన‌ట్లు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే చీఫ్ ప‌బ్లిక్ రిలేష‌న్ ఆఫీస‌ర్ ఎ.శ్రీధ‌ర్ తెలిపారు.

1. రైలు నెంబ‌ర్ 07117 తిరుప‌తి-ధ‌న‌పూర్‌ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలు ఫిబ్ర‌వరి 14 (శుక్ర‌వారం) తేదీన రాత్రి 11.45 గంటలకు తిరుప‌తి జంక్ష‌న్‌ నుండి బయలుదేరుతుంది. ఈ రైల...