భారతదేశం, జనవరి 28 -- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఏపీ సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రగతిని సాధించిందని గుర్తించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కానీ.. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డికి ఈ విషయం అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు.
'ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. గత దశాబ్ద కాలంగా ప్రభుత్వ ప్రగతిశీల విధానాల వల్ల.. తెలంగాణ భారతదేశంలో అత్యధిక తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రంగా మారిందని అనేక సందర్భాల్లో నిజాయితీగా అంగీకరించారు. ధన్యవాదాలు చంద్రబాబు గారూ. ఈ వాస్తవాన్ని జీర్ణించుకోలేని మీ పాత శిష్యుడికి దయచేసి అవగాహన కల్పించండి' అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. చంద్రబాబు మాట్లాడిన వీడియోను జత చేశారు.
దావోస్లో జరిగిన ఎకనామిక్ ఫోరం శిఖరాగ్ర సమావేశం నుండి తిరిగి వచ్చిన తర్వాత.. అమ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.