Hyderabad, మార్చి 4 -- krishna mukunda murari serial march 4th episode: దంపతులు ఒకరికొకరు ఎదురుగా నిలబడి భర్త పాదాల మీద పాదాలు పెట్టి గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయాలని పంతులు చెప్పడంతో ముకుంద షాక్ అవుతుంది. అలా చేస్తే దంపతులు కలకాలం కలిసి మెలిసి అన్యోన్యంగా ఉంటారని అంటాడు. ఇలాంటివి చేస్తేనే ముకుందకి బుద్ధి వస్తుందని కృష్ణ అనుకుంటుంది. పూజ అయిపోయిందని అనుకుంటే మళ్ళీ ఇదేంటి అసలు ఆదర్శ్ గాలి తగలకూడదని అనుకుంటుంటే మళ్ళీ తనని హత్తుకుని ప్రదక్షిణలు చేయడమా? ఇదంతా మురారి ప్లాన్ కాదు కదా. ఇది అసలు జరగకూడదు ఏదో ఒకటి చేయాలని ముకుంద డిసైడ్ అవుతుంది.

గుడిలో ఇలాంటి ప్రదక్షిణలు చేస్తారా అని ముకుంద అనుమానంగా అడుగుతుంది. దంపతులు ఇద్దరిని దగ్గర చేసే యజ్ఞం లాంటిదని కృష్ణ అంటుంది. అసలు ఇలాంటి ఛాన్స్ వస్తే ఎవరైనా వద్దని అంటారా? ముకుంద ఎందుకు వద్దని అంటుంద...