భారతదేశం, మార్చి 4 -- Krishna Guntur Mlc: ఉత్కంఠ రేపిన కృష్ణా-గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి తరపున పోటీ చేసిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌ విజయం సాధించారు. 7వ రౌండ్‌ ముగిసే సరికి ఆలపాటికి 1,18,070 ఓట్లు వచ్చాయి. మొత్తం 2,41,873 ఓట్లు పోలవగా, 21,577 చెల్లని ఓట్లుగా గుర్తించారు. 50 శాతానికి పైగా ఆలపాటి ఓట్లు సాధించడంతో ఆయనను విజేతగా ప్రకటించారు.

గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏడు రౌండ్లు ముగిసే సరికి ఆలపాటి 67,252 ఓట్ల మెజారిటీ సాధించారు. 7వ రౌండ్‌లో ఆలపాటికి 16,447 ఓట్లు రాగా, పీడీఎఫ్‌ అభ్యర్థి లక్ష్మణరావుకు 7,251 ఓట్లు వచ్చాయి. దీంతో ఏడో రౌండ్‌లో ఆలపాటికి 9,196 ఓట్ల ఆధిక్యం లభించింది.

ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌. ప్రతి రౌండ...