భారతదేశం, ఏప్రిల్ 24 -- కోటక్ మహీంద్రా బ్యాంక్ తన ఆన్ లైన్, మొబైల్ బ్యాంకింగ్ మార్గాల ద్వారా కొత్త కస్టమర్లను చేర్చుకోవద్దని, అలాగే, కొత్తగా క్రెడిట్ కార్డులను జారీ చేయవద్దని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆదేశించింది. 2022, 2023 సంవత్సరాలలో కొటక్ మహింద్ర బ్యాంక్ ఐటీ వ్యవస్థలో లోపాల కారణంగా ఆర్బీఐ ఈ ఆంక్షలు విధించింది.

కొటక్ మహింద్ర బ్యాంక్ ప్రస్తుత కస్టమర్లు ఆర్బీఐ తాజా ఉత్తర్వులపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆర్బీఐ ఆంక్షల కారణంగా ఇప్పటికే ఖాతాదారులుగా ఉన్నవారికి ఎలాంటి ఇబ్బంది లేదు. బ్యాంక్ ప్రస్తుత ఖాతాదారులకు వారి వారి ఖాతాలలోని డబ్బు సురక్షితంగానే ఉంటుంది. వారు తమ క్రెడిట్ కార్డు కార్యకలాపాలను కూడా కొనసాగించవచ్చు.

కొటక్ మహీంద్రా బ్యాంక్ పై విధించిన ఆంక్షలను వివరిస్తూ ఆర్బీఐ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో ''బ్యాంక్ తన ...