భారతదేశం, మార్చి 12 -- Kondaparthi Village: గవర్నర్ దత్తత గ్రామం కొండపర్తిలో దాదాపు రూ.కోటిన్నర అంచనా వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర మంత్రి సీతక్కతో కలిసి గవర్నర్ జిష్ణుదేవ్‌ మంగళవారం ప్రారంభించారు. మహిళలు, యువతకు వృత్తి నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు 30 లక్షల వ్యయంతో నిర్మించిన కమ్యూనిటీ భవనాన్ని ప్రారంభించారు. మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు.

అనంతరం గ్రామస్తులతో సమావేశమై వారి అభివృద్ధికి కావల్సిన మౌలిక వసతుల గురించి గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి నేరుగా మేడారం సమ్మక్క సారలమ్మ ప్రాంగణానికి చేరుకున్నారు. వన దేవతలకు ఎత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా గవర్నర్ జీష్ణు దేవ్ వర్మ మాట్లాడుతూ.. కొండపర్తి గ్రామాన్ని దత్తత తీసుకోవడం తనను ఎంతగానో ప్రభావితం చేసిందన్నారు.

ఆ గ్...