భారతదేశం, మార్చి 18 -- Konanki Sudikhsa Parents: డొమనికన్‌ రిపబ్లిక్‌ దేశంలో అదృశ్యమైన 20 ఏళ్ల భారతీయ విద్యార్థిని సుదిక్ష చౌదరి కోణంకి మరణించినట్లు ప్రకటించాలని అమెరికాలో స్థిరపడిన ఆమె కుటుంబం డొమినికన్ రిపబ్లిక్లోని పోలీసులను కోరింది.

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కోణంకి సుదిక్ష అమెరికాలో పర్మనెంట్‌ రెసిడెంట్‌గా ఉన్నారు. ఆమె కుటుంబం కడప జిల్లా నుంచి వాషింగ్టన్‌కు వలస వెళ్లి స్థిరపడ్డారు. సుదీక్ష చివరిసారిగా మార్చి 6న పుంటా కానా పట్టణంలోని రియు రిపబ్లిక్ రిసార్ట్ లో కనిపించారు.

డొమినికన్ రిపబ్లిక్ లో విహారయాత్రకు వెళ్లిన సుదిక్ష కనిపించకుండా పోయారని, ఆమె అదృశ్యంపై దర్యాప్తులో అమెరికా ఫెడరల్ లా ఎన్ ఫోర్స్ మెంట్ ఏజెన్సీలు కరీబియన్ దేశంలోని అధికారులతో కలిసి పనిచేస్తున్నాయి. దాదాపు రెండు వారాలుగా విస్తృతంగా గాలించినా ఆమె మృతదేహం లభ్యం కాకపోవడం అన...