Hyderabad, మార్చి 12 -- కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్న వారు ఆ నొప్పిని భరించలేకపోతుంటారు. రాళ్ల నొప్పి అకస్మాత్తుగా పుడుతుంది. కాసేపు చాలా ఇబ్బంది పెడుతుంది. ఇంజక్షన్ తీసుకున్న తర్వాతే ఆ నొప్పి కాస్త ఉపశమనం కలుగుతుంది. ఈ నొప్పి రావడం వల్ల ఆ వ్యక్తి కూర్చోలేక, నిల్చోలేక తన రోజువారీ పనులు చేయలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ సమస్య నుండి బయటపడడానికి కొంతమంది శస్త్ర చికిత్సల ద్వారా రాళ్ళను తీయించుకుంటారు. అయితే ఆయుర్వేద నివారణల ద్వారా రాళ్లను వాటికవే బయటికి వచ్చేలా చేయవచ్చు.

ఆరోగ్య నిపుణులు చెబుతున్న ప్రకారం ఆపరేషన్ చేయించుకుని కిడ్నీలో రాళ్లను తీయించుకున్న తర్వాత కూడా అవి ఏర్పడే అవకాశం అధికంగా ఉంటుంది. కాబట్టి రాళ్లను ఏర్పడకుండా ముందే జాగ్రత్త పడడం అవసరం. లేదా మూతపిండాల్లో రాళ్ళను తొలగించడానికి ఆయుర్వేద నివారణను పాటిస్తే మంచిది. శస్త్ర చికిత్...