భారతదేశం, ఏప్రిల్ 8 -- Kia Car Engines stolen: ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కియా కార్ల తయారీ ప్లాంటులో భారీ చోరీ వెలుగు చూసింది. శ్రీసత్యసాయి జిల్లాలో ఉన్న పెనుగొండలో కియా కార్ల తయారీ ప్లాంట్ ఉంది. ప్లాంటులో చోరీ జరిగినట్టు కొద్ది రోజుల క్రితం పోలీసులకు సమాచారం అందింది. దీనిపై రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కియా కార్ల తయారీ ప్లాంటు నుంచి 900 కియా కార్ల ఇంజిన్లు చోరీకి గురయ్యాయని దక్షిణ కొరియా కంపెనీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో కియా కార్ల తయారీ కర్మాగారాన్ని నడుపుతోంది, ఇక్కడ కార్‌ ఇంజిన్ల దొంగతనం దాదాపు ఐదేళ్ల క్రితం ప్రారంభమైందని పోలీసులు భావిస్తున్నారు. దీంతో కంపెనీ మార్చి 19న పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2020లో ఇంజిన్ దొంగతనాలు ప్రారంభమయ్యాయి. దాదాపు ఐదేళ్లుగా ఇది నిరంతర ప్రక్రియ...