భారతదేశం, ఏప్రిల్ 15 -- ఎద్దేడ్చిన ఎవుసం.. రైతేడ్చిన రాజ్యం బాగుపదడదని గుర్తు పెట్టుకోండి.. అంటూ సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు వ్యాఖ్యానించారు. నమ్మి ఓటేసినందుకు.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల గొంతు కోస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సర్కారు దుర్మార్గ వైఖరిని యావత్ తెలంగాణ గమనిస్తున్నదన్న హరీశ్.. మొద్దు నిద్రలో ఉన్న కాంగ్రెస్ పాలకులారా.. రైతన్న గోస ఇకనైనా పట్టించుకోండని హితవు పలికారు. వారి కన్నీటి కష్టాలు తీర్చండని సూచించారు.

'ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పుల్లయ్య బంజర గ్రామానికి చెందిన రైతు దంపతులు బొల్లం రామయ్య, చంద్రకళ ఆవేదన చూస్తే కడుపు తరుక్కుపోతున్నది. అకాల వర్షాలు, సాగు నీటి గోస, కరెంట్ కష్టాలను ఎదుర్కొని.. కౌలుకు తీసుకున్న 18 ఎకరాల్లో వరి సాగు చేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వ రూపంలో విపత్తు రైతన్నను నట్టేట ముంచింది. కొండంత సంబురంత...