భారతదేశం, మార్చి 20 -- KGBV Admissions: ఆంధ్రప్రదేశ్‌ కస్తుర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ప్రవేశాలకు మార్చి 22 నుండి ఆన్ లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారు. రాష్ట్రంలోని 352 కేజీబీవీల్లో 2025 - 26 విద్యా సంవత్సరానికి 6, 11 తరగతుల్లో ప్రవేశాల కోసం, 7, 8, 9, 10, 12 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం బాలికల నుండి ఆన్ లైన్ దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు తెలిపారు. ఆన్ లైన్ దరఖాస్తులు మార్చి 22 నుండి ఏప్రిల్ 11 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపారు.

ఏపీ కేజీబీవీల్లో అడ్మిషన్లకుే అనాథలు, బడి బయట పిల్లలు, డ్రాపౌట్స్ ( బడి మానేసిన వారు) పేద, ఎస్.సి, ఎస్.టి, బిసి, మైనారిటీ, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న బాలికలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఆన్లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులు మాత్రమే అడ్మిషన్ కొరకు పరిగణిస్తారు....