భారతదేశం, ఫిబ్రవరి 15 -- కరీంనగర్ మేయర్ పీఠం ఎవరికి దక్కబోతుందనేది ఉత్కంఠను రేపుతోంది. ఓవైపు తామే మెజార్టీ స్థానాలను గెలుచుకున్నామని చెబుతున్న బీజేపీ. మేయర్ పీఠం తమదేనని ధీమా వ్యక్తం చేస్తోంది. వారికి వచ్చిన సీట్లే కాకుండా. మరో నలుగురిని పార్టీలోకి తీసుకోగా. కావాల్సిన మద్దతుని కూడగట్టుకున్నామని ఎంపీ బండి సంజయ్ కూడా ప్రకటించారు. అయితే బీజేపీకి బ్రేకులు వేసే దిశగా కాంగ్రెస్ కూడా పావులు కదుపుతోంది. తాము కూడా రేసులో ఉన్నామని చెబుతోంది.

కరీంనగర్ మేయర్ పీఠంపై ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ లో మాదిరిగానే కరీంనగర్ లో కూడా బీజేపీకి మెజారిటీ లేదన్నారు. 16వ తేదీన ఏం జరుగుతుందో చూద్దామంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

నిజామాబాద్ మాదిరిగానే కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లోనూ బీజేపీ కి మెజారిటీ ల...