భారతదేశం, మార్చి 29 -- భారత రాజ్యాంగానికి భవిష్యత్‌లో ఆర్‌ఎస్ఎస్‌ భావజాలంతోనే ముప్పు పొంచి ఉందంటూ.. అసదుద్దీన్‌ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మజ్లిస్ పార్టీయే అసలైన దేశద్రోహ పార్టీ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ ప్రభుత్వం జాతీయవాద భావజాలంతో పనిచేస్తోందన్నారు. వక్ఫ్ బోర్డు బిల్లుపై దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోందన్నన్న సంజయ్.. ఒవైసీ సహా కుహానా లౌకిక వాదులు ఎంత అడ్డుకున్నా పార్లమెంట్‌లో అతి త్వరలోనే వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును ఆమోదం పొందుతుందని స్పష్టం చేశారు. దేశం ప్రజల కోసం మోదీ ప్రభుత్వం మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు వెనుకాడబోదని ఉద్ఘాటించారు.

కరీంనగర్‌లోని జిల్లా కోర్టు కాంప్లెక్స్‌లో న్యాయవాదుల డిజిటల్ లైబ్రరీ కోసం బండి సంజయ్ రూ.15 లక్షలు మంజూరు చేశారు. న్యాయవాదులంతా బండి సంజయ్‌ని సన్మానించారు. ఈ సందర...