భారతదేశం, ఏప్రిల్ 3 -- Kanigiri CBG Plant: ఏపీలో పి4 విధానానికి రిలయన్స్ సీబీజీ ప్లాంట్స్ నాంది కాబోతున్నాయి, పేదరికం లేకుండా చేయడంలో ఇదొక ముఖ్యమైన అడుగు కాబోతోందని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పిసిపల్లి మండలం దివాకరపురంలో రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేస్తోన్న కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంటుకు మంత్రి లోకేష్ భూమిపూజ చేశారు.

ఎటువంటి నీటివసతి లేని మెట్టప్రాంతంలోని రైతులకు ఈ ప్లాంట్స్ ద్వారా పెద్ద ఎత్తున మేలు జరుగుతుందని, నైపర్ రకం గడ్డి తో బయో గ్యాస్ తయారు చెయ్యబోతున్నారని వివరించారు. ఈ ప్లాంట్‌ కోసం ప్రభుత్వ భూములకు ఎకరాకు రూ.15 వేలు, రైతుల భూములకు రూ.31 వేలు కౌలు కూడా ఇవ్వబోతున్నారని చెప్పారు.

రైతులే గడ్డి పెంచి ఇస్తే టన్నుకు నిర్ణీత ధర చెల్లిస్తారని రిలయన్స్ సంస్థ ఏర్పాటు...