భారతదేశం, ఏప్రిల్ 18 -- Journey To Ayodhya Movie: ప్ర‌స్తుతం టాలీవుడ్‌, బాలీవుడ్ అనే భేదాలు లేకుండా అన్ని ఇండ‌స్ట్రీల‌లో మైథ‌లాజిక‌ల్ మూవీస్ ట్రెండ్ న‌డుస్తోంది. పౌరాణిక క‌థ‌ల్ని వెండితెర‌పై ఆవిష్క‌రించేందుకు ద‌ర్శ‌కులు క‌థ‌లు సిద్ధం చేస్తున్నారు. ఈ మైథ‌లాజిక‌ల్ మూవీస్‌లో న‌టించ‌డానికి స్టార్ హీరోలు సైతం ఆస‌క్తిని చూపుతున్నారు. తాజాగా రామాయ‌ణం ఆధారంగా తెలుగు సిల్వ‌ర్ స్క్రీన్‌పై ఓ మూవీ రాబోతోంది.

ఈ సినిమాకు జ‌ర్నీ టూ అయోధ్య అనే వ‌ర్కింగ్ టైటిల్‌ను ఖ‌రారు చేశారు. గోపీచంద్‌తో విశ్వం మూవీని నిర్మిస్తోన్న వేణు దోనేపూడి జ‌ర్నీ టూ అయోధ్య మూవీని ప్రొడ్యూస్ చేయ‌బోతున్నాడు. విశ్వం త‌ర్వాత త‌న బ్యాన‌ర్ చిత్రాల‌యం స్టూడియోస్ వేణు దోనేపూడి నిర్మించ‌నున్న సెకండ్ మూవీ ఇదే కావ‌డం గ‌మ‌నార్హం. శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా ఈ సినిమాను అనౌన్స్‌చేశారు. ప్రీ లుక...