భారతదేశం, ఏప్రిల్ 25 -- JEE Mains 2024 Results: జేఈఈ మెయిన్స్‌ 2024 (Session-2) ఫలితాలు Results విడుదల అయ్యాయి. తాజా ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన 22మంది విద్యార్ధులకు 100శాతం NTA Score ఎన్టీఏ స్కోర్ సాధించారు. జాతీయ స్థాయిలో అత్యధిక స్కోర్ సాధించిన వారిలో తెలుగు విద్యార్ధులే అధికంగా ఉన్నారు.

ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష జేఈఈ-మెయిన్స్ సెషన్‌ 2లో ఇద్దరు బాలికలు సహా 56 మంది అభ్యర్థులు 100 ఎన్టీఏ స్కోరు సాధించారని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) బుధవారం రాత్రి ప్రకటించింది.

దేశంలోని 23 ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌కు అర్హత సాధించిన వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఐదేళ్ల గరిష్ట స్థాయికి వీరి సంఖ్య చేరింది.

జేఈఈ మెయిన్స్ జనవరి సెషన్‌లో 23 మంది అభ్యర్థులు 100 ఎన్టీఏ స్కోర్ సాధించగా...