భారతదేశం, ఫిబ్రవరి 17 -- జేఈఈ మెయిన్‌-2026 మొదటి సెషన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు మెరిశారు. తాజాగా విడుదలైన ఫలితాల్లో దేశవ్యాప్తంగా 12 మంది విద్యార్థులు 100 పర్సంటైల్‌ స్కోర్‌ సాధించారు. అయితే వారిలో ముగ్గురు తెలుగు రాష్ట్రాల వాళ్లు ఉన్నారు. ఏపీ నుంచి ఇద్దరు కాగా. తెలంగాణ నుంచి ఒకరున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రేంద్రబాబు గారి మహిత్, పసల మోహిత్ 100 పర్సంటైల్‌ స్కోర్ సాధించారు. ఇక తెలంగాణకు చెందిన వివాన్ శరద్ మహిశ్వరి కూడా 100 పర్సంటైల్‌ సాధించిన వారిలో ఒకరిగా ఉన్నాడు. రెండో విడత పరీక్ష తర్వాత విడుదలయ్యే తుది ర్యాంకుల్లో వీరికి మంచి ర్యాంకులు దక్కే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఏపీ నుంచి 100 పర్సంటైల్ సాధించిన విద్యార్థులకు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ చేశారు. "జేఈఈ మెయి...