భారతదేశం, ఏప్రిల్ 12 -- Jangaon Accident : జనగామ జిల్లాలో అక్రమ మట్టి దందా ఓ యువకుడి ప్రాణం తీసింది. ఇటుక బట్టీ పనుల కోసం రేగడి మట్టి లోడ్ తో వచ్చిన ట్రాక్టర్ అక్కడున్న యువకుడి తలపై బోల్తా పడటంతో అతడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. దీంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. స్థానికులు తెలిపిన ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

జనగామ జిల్లా కొడకండ్ల మండలంలోని మొండ్రాయి గ్రామ శివారులోని గిర్ని తండా సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద ఇటుక బట్టీ పనులు నడుస్తున్నాయి. ఇటుకల తయారీ కోసం బోడోనికుంట నుంచి గిర్నితండాకు ట్రాక్టర్ తో రేగడి మట్టి చేరవేస్తుండగా... మొండ్రాయి గ్రామానికి చెందిన విఘ్నేష్(18) అనే యువకుడు లోడింగ్ లిస్ట్ రాస్తున్నాడు. ఒక్కో ట్రాక్టర్, ఎన్ని ట్రిప్పులు వస్తోందో లెక్కలు వేస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం ఉదయం ఓ ట్రాక్టర్ మట్టిని అన్ లోడ్ చే...