భారతదేశం, ఫిబ్రవరి 15 -- జనసేన నూతన సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైంది. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. పార్టీ బలోపేతం కోసం రూ. 2 కోట్ల భారీ విరాళాన్ని అందజేశారు. నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా తొలి సభ్యత్వాన్ని తీసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన. పార్టీ భావజాలాన్ని అర్థం చేసుకొని, పార్టీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేవారు మనకు ముఖ్యమన్నారు. అలాంటి వారే పార్టీకి అవసరమని స్పష్టం చేశారు.

పార్టీ భావజాలాన్ని లోతుగా అర్థం చేసుకొని, పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసేందుకు ఎవరైతే ముందుకు వచ్చి పార్టీ సభ్యత్వం తీసుకుంటారో వారిని "ఉద్యమి"గా పిలుస్తామని పవన్ కల్యాణ్ ప్రకటించారు. పార్టీ పోరాటానికి మరింత బలాన్ని అందించి, నవతరంలో ప్రేరణ కలిగించి పా...