భారతదేశం, మార్చి 16 -- Jagtiyal Crime : జగిత్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అక్కాచెల్లెళ్లు ఇద్దరినీ పెళ్లి చేసుకున్న వ్యక్తి ముచ్చటగా మరో మహిళను మూడో పెళ్లి చేసుకున్నాడు. మూడు ముళ్ల బంధం, ముగ్గురు యారండ్ల మధ్య ఆస్తి తగాదాకు దారి తీసి చివరకు ఇంటి యజమాని ప్రాణాలు తీసింది. విషాదకర ఘటన జగిత్యాల జిల్లా పోలాసలో చోటుచేసుకుంది.

జగిత్యాల రూరల్ మండలం పోలాస గ్రామానికి చెందిన పడాల కమలాకర్ పై మొదటి భార్య, పిల్లలు పెట్రోల్ పోసి నిప్పంటించారు. తీవ్ర గాయాల పాలైన కమలాకర్ జగిత్యాల ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. కమలాకర్ కు ముగ్గురు భార్యలు ఉన్నారు. ఆస్తి విషయంలో గొడవ జరగడంతో మొదటి భార్య జమున ఆమె పిల్లలు కమలాకర్ పై దాడి చేసి పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

కమలాకర్...