తెలంగాణ,జగిత్యాల, ఫిబ్రవరి 9 -- జగిత్యాల ప్రాంతంలో ద్విచక్రవాహనాలను దొంగిలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం ఐదు మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. గత నెలలో తిప్పన్నపేటకు చెందిన పెద్ది రాజు అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టారు.

ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం ఒక కారులో వస్తున్న ఐదుగురు వ్యక్తులను అనుమానితులుగా గుర్తించారు. అదుపులోకి తీసుకుని విచారించగా. వారి దొంగతనాల చిట్టా బయటికి వచ్చింది.

వీరంతా ఒక ముఠాగా ఏర్పడి రాత్రి సమయంలో స్థానికంగా ఉన్న గ్రామాల్లో తిరుగుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇంటి ముందు పార్కింగ్ చేసిన బైకులను టార్గెట్ చేస్తూ చోరీలు చేస్తున్నట్లు గుర్తించారు. పెంబట్లు, వెలనగూర్, బెల్గాల్, తిప్పన్నపేటలోని మరో గ్రామంలో కూడా బైక్ లను చోరీ చేసినట్లు విచారణలో ఒప్పుకున్నట్లు పోలీసులు వెల్లడించారు...