కరీంనగర్,తెలంగాణ, మార్చి 21 -- Dharmapuri Lakshmi Narasimha Swamy Jatara 2024 : జాతరకు వెళ్ళితే ఎదో ఒక వస్తువు కొంటాం. చిన్నదా, పెద్దదా అని చూడకుండా జాతర గుర్తుగా ఓ వస్తువు కొని మురిసిపోతాం. హోదాతో సంబంధం లేకుండా జాతరంటే ఎవ్వరైనా మక్కువ చూపుతారు. అలానే జగిత్యాల జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషా(Jagtial Collector Yasmeen Basha). ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి జాతరలో తన ప్రత్యేకతను చాటుకున్నారు. 13 రోజులపాటు జరిగే లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన కలెక్టర్, జాతరలో కలియ తిరిగారు. దుకాణాలను పరిశీలించి గాజులు కొనుగోలు చేశారు. స్వయంగా గాజులు వేసుకుని మురిసిపోతూ దుకాణదారురాలుకు ఐదువందల కరెన్సీ నోటు ఇచ్చి అక్కడి నుంచి జారుకున్నారు. కలెక్టర్ జాతరలో తిరిగి గాజులు కొనుగోలు చేయడం స్థానికులు ఆశ్చర్యంగా...