భారతదేశం, ఫిబ్రవరి 6 -- Jagan On Saireddy: వైసీపీని వీడి బయటకు వెళ్లిన ఎంపీలపై జగన్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వెళ్లే నాయకులకు వ్యక్తిత్వం, విశ్వసనీయత ఉండాలని సాయిరెడ్డితో కలుపుకుంటే నలుగురు పార్టీని వీడి బయటకు వెళ్లారని వారందరికి అదే వర్తిస్తుందని జగన్‌ అన్నారు.

పోయే ప్రతి ఒక్కరికి ఒకటే మాట చెబుతున్నానని రాజకీయాల్లో క్యారెక్టర్‌, క్రెడిబిలిటీ ఉండాలని, క్యాడర్‌ కాలర్ ఎగరేసుకుని ఫలనా వ్యక్తి తమ నాయకుడు అని చెప్పుకోవాలన్నారు. ఎమ్మెల్యే, ఎంపీల గురించి వారు అలాగే చెప్పుకోవాలన్నారు. భయపడో, ఏదో కారణం చేతో మనంతట మనమే రాజీపడి అటు వైపు వెళితే వారికి గౌరవం, క్యారెక్టర్‌ వాల్యూ ఏముంటుందన్నారు.

కష్టం ఎల్లకాలం ఉండవని, అధికారం ఐదేళ్లు మాత్రమే ఎవరికైనా ఉంటుందని, ఐదేళ్లు ఓర్చుకుంటే సరిపోతుందన్నారు. సాయిరెడ్డికైనా, పార్టీని వీడి బయటకు వెళ్లిన ముగ్గురికైనా...