భారతదేశం, ఏప్రిల్ 11 -- Jagamerigina Satyam: ర‌వితేజ ఫ్యామిలీ నుంచి మ‌రో కొత్త హీరో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. ర‌వితేజ మేన‌ల్లుడు అవినాష్ వ‌ర్మ హీరోగా జ‌గ‌మెరిగిన స‌త్యం పేరుతో ఓ మూవీ తెర‌కెక్కుతోంది. ఈ మూవీలో అవినాష్ వర్మకు జోడీగా ఆద్య రెడ్డి, నీలిమ హీరోయిన్లుగా న‌టిస్తోన్నారు. ఈ మూవీతో తిరుప‌తి పాలే డైరెక్ట‌ర్‌గా తెలుగు చిత్ర‌సీమ‌కు ప‌రిచ‌యం అవుతోన్నారు.

ఈ సినిమా షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. ఏప్రిల్18న జ‌గ‌మెరిగిన స‌త్యం థియేట‌ర్ల‌లో రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ నుండి ఏరువాక ఆగే అనే సాంగ్ ను న‌టుడు రాజేంద్రప్రసాద్ రిలీజ్ చేశారు.

విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ట్ర‌యాంగిల్ ల‌వ్‌స్టోరీగా జ‌గ‌మెరిగిన స‌త్యం మూవీ రూపొందుతున్న‌ట్లు స‌మాచారం. తెలంగాణ‌ 1994 లో జరిగిన ఒక యథార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమాను ...