భారతదేశం, మార్చి 27 -- IRCTC Tour: ఐఆర్‌‌సీటీసీ టూరిజం ప్యాకేజీల్లో భాగంగా విజయవాడ నుంచి సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్ర నిర్వహించనున్నారు. ఈ యాత్రలో భాగంగా ఉజ్జయిని, ద్వారకా, సోమ్‌నాథ్‌, పూణే, నాసిక్‌, ఔరంగాబాద్‌ మీదుగా 12 రోజుల పాటు ఈ యాత్ర సాగుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన స్టేషన్లలో బోర్డింగ్ సదుపాయం కల్పించారు.

11 రాత్రులు, 12 పగళ్లలో సాగే సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్ర ఏప్రిల్ 8వ తేదీన ప్రారంభం అవుతుంది. ఈ యాత్రలో భాగంగా ఉజ్జయినిలో మహాకాళేశ్వర్‌, ఓం కారేశ్వర్‌, ద్వారకా, సోమ్‌నాథ్‌, పూణేలో భీమశంకర్‌, నాసిక్‌లో త్రయంబకేశ్వర్‌, ఔరంగాబాద్‌‌లో గ్రిష్‌నేశ్వర్‌ మీదుగా ఈ యాత్ర సాగుతుంది. ఈ యాత్రకు 718మంది పాల్గొనవచ్చు. స్లీపర్‌, థర్డ్‌ ఏసీ, సెకండ్ ఏసీ కోచ్‌లలో ప్రత్యేక రైలును ఏర్పాటు చేస్తారు.

ఎకానమీ విభాగంలో డబుల్‌, ట్రిపుల్‌ షే...