తిరుమల,కరీంనగర్, మార్చి 14 -- IRCTC Karimnagar Tirumala Tour Package 2024: ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలని అనుకుంటున్నారా..? అయితే అతి తక్కువ ధరలోనే టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకువస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం(IRCTC Tourism). దేశవ్యాప్తంగానూ పలు ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. తాజాగా ఏపీలోని తిరుమల శ్రీవారి(Tirumala) దర్శనంతో పాటు కాణిపాకం, తిరుచానూరు, తిరుపతి వంటి ప్రాంతాలను దర్శించుకునేందుకు సప్తగిరి పేరుతో టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ ప్యాకేజీని కరీంనగర్ పట్టణం నుంచి ఆపరేట్ చేస్తుంది.

ఈ సప్తగిరి టూర్ ప్యాకేజీ ప్రస్తుతం మార్చి 28, 2024వ తేదీన అందుబాటులో ఉంది. నాలుగు రాత్రులు, మూడు రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ట్రైన్ జర్నీ ద్వారా ఆపరేట్ చేస్తున్నారు. కరీంనగర్ నుంచి జర్నీ స్టార్ట్ అవుతుంది. పెద్దపల్లి, వరంగల్ రైల్వే స్టేష...