భారతదేశం, మార్చి 14 -- విజ‌య‌వాడ నుంచి స‌ప్త జ్యోతిర్లింగ యాత్ర‌కు సంబంధించి.. ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. మొత్తం 11 రాత్రులు/ 12 రోజుల యాత్ర ఉంటుంది. ఏప్రిల్ 8 తేదీన రాత్రి 9 గంట‌ల‌కు విజ‌య‌వాడ‌ నుంచి రైలు బ‌య‌లుదేరుతుంది. ఖ‌మ్మం, కాజీపేట‌, సికింద్రాబాద్‌, నిజామాబాద్ మీదుగా స‌ప్త జ్యోతిర్లింగ‌ యాత్ర సాగుతోంది.

ఈ యాత్రలో భాగంగా.. ఉజ్జయిని, ద్వారక‌, సోమ‌నాథ్, పూణే, నాసిక్‌, ఔరంగాబాద్‌లో పుణ్య‌క్షేత్రాల‌ను సంద‌ర్శించే అవకాశం ఉంటుంది. తిరిగి ఏప్రిల్ 19న మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు విజ‌య‌వాడ‌ చేరుకుంటుంది. మొత్తం 718 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అందులో 460 స్లీప‌ర్ క్లాస్‌, 206 థ‌ర్డ్ ఏసీ, 52 సెకెండ్ ఏసీ బెర్త్‌లు ఉన్నాయి.

స్లీప‌ర్ క్లాస్- పెద్ద‌ల‌కు రూ.20,890, పిల్ల‌లకు (5-11 ఏళ్ల‌ు) రూ.19,555

థ‌ర్డ్ ఏసీ- పెద్ద‌ల‌కు రూ.33,735, ప...