భారతదేశం, ఏప్రిల్ 1 -- IIIT Deaths: అలహాబాద్ ట్రిపుల్ ఐటీలో చదువుతున్న ఇద్దరు తెలుగు విద్యార్థులు అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయారు. ఒకరు గుండెపోటుతో మర ణించగా స్నేహితుడి మరణాన్ని తట్టుకోలేక మరొకరు ఆత్మహత్య చేసుకున్నారు. అల హాబాద్ ట్రిపుల్ ఐటీ ప్రాంగణ అధికారులు, తోటి విద్యార్థులు అందించిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా మాడ్గులకు చెందిన కాట్రావత్ రాజూనాయక్, దేవి దంపతుల కుమారుడు అఖిల్ అలహాబాద్ ట్రిపుల్ ఐటీలో ఇంజినీరింగ్ ఫస్టియర్ చదువుతున్నాడు.

ట్రిపుల్‌ ఐటీ హాస్టల్లో శనివారం రాత్రి 9 గంటల సమయంలో గదిలోకి వెళ్లిన అఖిల్ గుండెపోటుతో మరణించాడు. అధికారులు సమాచారం ఇవ్వడంతో తల్లిదండ్రులు రాజూనాయక్, దేవి ప్రయాగ్ రాజ్‌ వెళ్లారు. కుమారుడి మరణంపై అఖిల్ తల్లిదండ్రులు ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో ఆందోళన నిర్వహించారు. వర్శిటీ అధికారుల నిర్లక్ష్యంతోనే కుమారుడు ప...