భారతదేశం, ఫిబ్రవరి 8 -- హ్యుందాయ్​ మోటార్స్​ నుంచి కీలక్​ అప్డేట్​ వచ్చింది! హ్యుందాయ్​ ఎక్స్​టర్​ ఎస్​యూవీ, ఆరా కార్లను అప్​డేట్​ చేసినట్టు సంస్థ వెల్లడించింది. అంతేకాదు, వీటిల్లో కొత్త వేరియంట్లను కూడా తీసుకొచ్చినట్టు తెలిపింది. హ్యుందాయ్​ ఎక్స్‌టర్​ ఎస్​యూవీలో కొత్త మిడ్-స్పెక్ వేరియంట్లు - ఎస్​ఎక్స్​ టెక్, ఎస్​+, మరిన్ని సీఎన్జీ ఆప్షన్స్​ యాడ్​ అయ్యాయి. మరోవైపు, హ్యుందాయ్​ ఆరా పెట్రోల్, CNG ఇంజిన్​ ఆప్షన్స్​లో ఒక కార్పొరేట్ వేరియంట్‌ యాడ్​ అయ్యింది. ఆ వివరాలు.

ఎక్స్‌టర్ కొత్త ఎస్​ఎక్స్​ టెక్ వేరియంట్‌ను పొందుతుంది. ఇది పెట్రోల్, హై-CNG డ్యూయో ఇంజిన్​లతో అందుబాటులో ఉంటుంది. కొత్త ట్రిమ్ స్మార్ట్ కీతో పుష్ బటన్ స్టార్ట్/స్టాప్, డ్యూయెల్ కెమెరాతో డాష్‌క్యామ్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లేతో 8-ఇంచ్​ టచ్‌స్క్రీన్ ఇ...