తెలంగాణ,హైదరాబాద్, ఫిబ్రవరి 17 -- Hyderabad Jewellery Shop Robbery Case : హైదరాబాద్ లోని చాదర్ ఘట్ అక్బర్ బాగ్ చౌరస్తాలో రెండు రోజుల క్రితం కిస్వ జువెలర్స్ లో చోటు చేసుకున్న దోపిడీ కేసును పోలీసులు చేధించారు. ఈ నేరానికి ఒడిగట్టిన ముగ్గురు నిందితులను సౌత్ ఈస్ట్, చాదర్ ఘాట్ పోలీసులు గంటల వ్యవధిలోనే నిందితులను గుర్తించి పట్టుకున్నట్లు డీసీపీ జానకి ధారావత్ పేర్కొన్నారు.ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఏసిపి కార్యాలయంలో పోలీసులు వెల్లడించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం......ముంబైకి చెందిన నజీమ్ అక్కడే గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. తన తల్లితండ్రులు మరియు సోదరి కొన్నాళ్లుగా అమెరికాలో ఉంటున్నారు. నజీమ్ చిన్న వయసులోనే విలాసవంతమైన జీవితానికి అలవాటుపడి ఎక్కువగా డబ్బు ఖర్చు చేసేవాడు.దీంతో అతడి తండ్రి హాసన్ తన సంపాదన, ఆస్తిని కుమారుడి చేతికి అందకుండా ...