భారతదేశం, ఏప్రిల్ 11 -- ఫ్యూచర్ సిటీ వరకు మెట్రోను విస్తరించాలని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అందుకు అవసరమైన తుది ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మెట్రో విస్తరణపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మెట్రో రెండో దశ విస్తరణకు సంబంధించిన ప్రతిపాదనల పురోగతిపై రేవంత్ ఆరా తీశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రావాల్సి ఉందని, ఇప్పటికే ఢిల్లీలో అధికారులను కలిసి సంప్రదింపులు జరిపినట్లు అధికారులు వివరించారు.

హైద‌రాబాద్ మెట్రో రెండో ద‌శ విస్త‌ర‌ణ‌కు సంబంధించి.. నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వరకు (36.8 కి.మీ.), రాయ‌దుర్గం- కోకాపేట నియోపొలిస్ (11.6 కి.మీ.), ఎంజీబీఎస్‌- చాంద్రాయ‌ణ‌గుట్ట (7.5 కి.మీ.), మియాపూర్‌- ప‌టాన్‌చెరు (13.4 కి.మీ.), ఎల్‌బీ న‌గ‌ర్‌- హ‌య‌త్‌న‌గ‌ర్ (...