తెలంగాణ,హైదరాబాద్, ఏప్రిల్ 22 -- Hyderabad Crime News : కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. కామాంధుల ఘాతుకానికి ఓ మహిళ బలి అయింది. ఇద్దరు అగంతకులు లైంగిక దాడికి పాల్పడడంతో తీవ్ర రక్తస్రావంతో సదరు మహిళ అక్కడే మరణించింది.

పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.....కూకట్ పల్లి ప్రశాంత్ నగర్ లోని విష్ణు ప్రియ లడ్జ్ సమీపంలోని ఏ ఆర్ పైప్ వర్క్స్ సెలర్ లో ఓ మహిళ మృతి దేహం ఉందనే సమాచారం అందటంతో కూకట్ పల్లి ఏసిపి శ్రీనివాస్ రావు, సీఐ కృష్ణమోహన్ లు సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి వెళ్ళారు. ఆదివారం తెల్లవారుజామున సుమారు 4 - 5 గంటల మధ్య వైన్ షాపు వద్ద రోడ్డుపై ఓ మహిళ మూసాపేటకు వెళుతుండగా.....ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు అగంతకులు ఒకరు చేతులు,మరొకరు కాళ్ళు పట్టుకొని బలవంతంగా పక్కనే ఉన్న ఏ ఆర్ పైప్ వర్క్స్ సెల్లార్ కు లాకెళ్లి ఆమెపై లైంగి...