భారతదేశం, మార్చి 11 -- హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న శ్రీచైతన్య విద్యాసంస్థల్లో.. ఐటీ అధికారులు రెండో సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో భాగంగా ఐటీ అధికారులు రూ.5 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొత్త ఆర్థిక సంవత్సరం, రాబోయే విద్యా సంవత్సరం నేపథ్యంలో ఫీజుల వసూళ్లు, ఐటీ చెల్లింపులపై అధికారులు ఆరా తీస్తున్నారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ తోపాటు దేశవ్యాప్తంగా ఉన్న శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. లావాదేవీల మెయింటెనెన్స్ కోసం ఉపయోగించిన సాఫ్ట్‌వేర్లను పరిశీలించారు. విద్యా సంస్థలతో పాటు ట్రస్ట్, ఇతర ప్రైవేట్ కంపెనీల ట్యాక్స్ చెల్లింపులను వెరిఫై చేస్తున్నారు. శ్రీచైతన్య విద్యాసంస్థలకు చెందిన గత ఐదు సంవత్సరాల ఐటీ చెల్లింపుల వివరాల ఆధారంగా సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా ఫీజుల పెంపుతో పాటు అధ...