తెలంగాణ,పుప్పాలగూడ, ఫిబ్రవరి 28 -- రంగారెడ్డి జిల్లాలోని పుప్పాలగూడలో అగ్నిప్రమాదం జరిగింది. రెండతస్తుల భవనంలో (జీ ప్లస్ 2)ని గ్రౌండ్‌ ఫ్లోర్‌లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది. అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టింది. చనిపోయిన వారిలో ఏడేళ్ల చిన్నారి ఉండగా. మరో ఇద్దరు మహిళలు ఉన్నారు.

ఈ ప్రమాద ఘటనలో పలువురిని తాళ్ల సాయంతో బయటికి తీసుకువచ్చారు. భవనంలో లోని గ్యాస్‌ సిలిండర్ల పేలుడుతో ప్రమాద తీవ్రత పెరిగినట్లు తెలిసింది.ఈ ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....